మహానటి చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు – దుల్కర్ సల్మాన్

  • September 24, 2018 / 10:44 AM IST

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు అయినప్పటికీ దుల్కర్ సల్మాన్ సొంతంగా ఎదిగేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా దక్షిణాది అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. “ఓకే బంగారం” సినిమా ద్వారా తెలుగువారికి పరిచయమైన దుల్కర్, మహానటిలో జెమినీ గణేశన్ గా నటించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. ఈ సినిమా కీర్తి సురేష్ కి ఎక్కువమంది అభిమానులను తెచ్చిపెడితే.. దుల్కర్ కి మాత్రం అభిమానుల నుంచి తిట్లు తెచ్చి పెట్టింది. ఈ విషయాన్నీ స్వయంగా దుల్కర్ చెప్పారు,. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ.. ” మహానటి సినిమా చూశాక చాలామంది మహిళా అభిమానులు సోషల్ మీడియాలో ‘ఐ హేట్ యూ’ అంటూ కామెంట్లు పెట్టారు.

ఈ సినిమాలో నాది చాలా కీలకమైన పాత్ర కావడంతోనే నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ నటించేందుకు ఒప్పుకున్నాను.” అని వివరించారు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాధించిన యువ దర్శకుడు అజయ్ భూపతి.. ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు. అందులో రామ్ ఒక హీరో కాగా.. మరో హీరోగా దుల్కర్ సల్మాన్ పేరు వినిపిస్తోంది. స్రవంతి రవి కిషోర్ నిర్మించనున్న ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus