సినిమా మెయిన్‌ పాయింట్‌ అక్కణ్నుంచే తీసుకున్నారట

  • March 26, 2021 / 07:49 PM IST

‘జాతిరత్నాలు’ సినిమా చూశారా… చూసినవాళ్లకు అందులో ‘శ్రీకాంత్‌ లేడీస్‌ ఎంపోరియం’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడనివాళ్లకు అయితే ఇది కొత్తగా ఉంటుంది. సినిమా మొత్తం నడవడానికి ఆ ‘లేడీస్‌ ఎంపోరియం’ అనే టాపిక్కే ప్రాణం. తనికెళ్ల భరణి ఆ మాట అనడంతోనే, హీరో హైదరాబాద్‌ వచ్చి ఉద్యోగం వేటలో పడతాడు. అంత కీలకమైన పాయింట్‌ వెనుక ఓ హిట్‌ బాలీవుడ్‌ ఉందట. ఈ విషయాన్ని దర్శకుడు అనుదీపే చెప్పాడు. అనుదీప్‌కు నచ్చే దర్శకుల్లో రాజ్‌కుమార్‌ సంతోషి ఒకరు.

బాలీవుడ్‌ ఆయన చాలా గొప్ప గొప్ప సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆయన సినిమాల్ని అనుదీప్‌ బాగా గమనించేవాడు. అలా ‘అందాజ్‌ అప్నా అప్నా’లో ఓ డైలాగ్‌ విని ‘జాతిరత్నాలు’ పాయింట్‌ స్ట్రయిక్‌ అయ్యిందట. ‘అందాజ్‌ అప్నా అప్నా’లోని ఓ సీన్‌లో హీరో ఆమిర్‌ ఖాన్‌ లేడీస్‌ ఎంపోరియం గురించి మాట్లాడతాడు. ఆ డైలాగ్‌ వినే అనుదీప్‌ ‘జాతిరత్నాలు’లో కీలకమైన లేడీస్‌ ఎంపోరియం పాయింట్‌ రాసుకున్నారట. ఇక సినిమా విషయానికొస్తే…

థియేటర్లలోకి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇటీవల చిత్రబృందం ఓవర్సీస్ టూర్‌ పూర్తి చేసుకొని స్వదేశానికి చేరుకుంది. సినిమా ప్రమోషనల్‌ టీమ్‌ ఎంత ప్రత్యేకంగా ప్లాన్‌ చేస్తోంది అంటే… రాహుల్‌ రామకృష్ణ అమెరికా వెళ్లపోవడాన్ని కూడా ఫన్నీ వీడియో చేసి ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు సొంతంగా మీమ్స్‌ వీడియోస్‌ చేసి అదరగొడుతోంది. అన్నట్లు ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు దర్శకుడు అనుదీప్‌.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus