అగిప్రమాదం సంభవించడంతో ‘సైరా’ టీమ్ కు భారీ నష్టం..!

  • May 3, 2019 / 02:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తన 151 వ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతుంది కాబట్టి.. అందులోనూ మెగాస్టార్ కు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో… దీనిని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని అయన తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అప్పటికాలం నటి కథ కాబట్టి సెట్లు కూడా చాలా వేయాల్సి వస్తుంది. అయితే ఈ సెట్లు వేసిన ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కోకాపేటలోని చిరంజీవి ఫామ్ హౌస్లో ఓ భారీ సెట్ వేశారు. అయితే అనుకోకుండా ఈ సెట్లో అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం కోట్లలోనే ఉంటుందని అని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయ్యిందని సమాచారం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా చేయాల్సి ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus