ఆ సీన్స్ ఆచార్యలో హైలెట్ అవ్వబోతున్నాయి..!

  • January 7, 2021 / 10:54 AM IST

మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఆచార్య సినిమా అప్ డేట్స్ కోసం మెగాఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసంట్ గా మెగాస్టార్ ఆచార్య సెట్ ని చూపిస్తూ ఆర్ట్ డైరెక్టర్ ని, డైరెక్టర్ కొరటాల శివని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా కీలకమైన పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ ఈసినిమాకోసం అడవి బాట పట్టినట్లుగా సమాచారం తెలుస్తోంది.

రీసంట్ గా అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో మారేడు మిల్లి అడవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తుంటే, ఇప్పుడు తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇదే అడవిలో షూటింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమా లో రామ్‌చరణ్‌ , చిరంజీవిల మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయట. ఈ సినిమాలో నక్సలైటు పాత్రలో కనిపించనున్న చరణ్‌

ఆ పాత్రకి సంబంధించిన షూటింగ్‌ కోసం మారేడిమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నాడని చెప్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, చరణ్‌ లు కలిసి నటించే సన్నివేశాల చిత్రీకరణ సాగుతోందని, ఈసీన్స్ చాలా హైలెట్ గా నిలబోతున్నాయని మూవీ టీమ్ నుంచి సమాచారం. దేవాదాయ భూముల స్కాంపై ఈసినిమా స్టోరీలైన్ ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈసినిమా సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదీ విషయం.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus