వర్కువుటయితే ఓకే లేదంటే.. రెండూ అస్సామే బుజ్జి..!

  • March 16, 2020 / 06:06 PM IST

‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ 2018.. సెప్టెంబర్ నుండీ ఖాళీగా ఉంటూ వస్తున్నాడు. ఎట్టకేలకు అతనికి నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ’14 రీల్స్’ వారు నిర్మాతలు. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించేసారు కూడా..! అయితే ఇది మొదలవడానికి ముందే.. అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రీకరణ సమయంలోనే మహేష్ బాబుకి ఓ లైన్ వినిపించాడట. అయితే లైన్ నచ్చింది కానీ వంశీ పైడిపల్లి తో నెక్స్ట్ సినిమాకు కమిట్ అయ్యానని మహేష్ చెప్పాడట. దీంతో నాగ చైతన్యతోనే సినిమా చెయ్యాలని పరశురామ్ డిసైడ్ అయ్యాడు. కానీ అనుకోకుండా వంశీ పైడిపల్లితో చేయాల్సిన ప్రాజెక్ట్ ను మహేష్ హోల్డ్ లో పెట్టాడు. అంతే పరశురామ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి.. వెంటనే ఈ డైరెక్టర్ కు ఫోన్ చేసాడు.

అంతే మహేష్ కోసం కథని సిద్ధం చేసే పనిలో పడ్డాడు. మరోపక్క చైతన్య… శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కానీ నిర్మాతలైన ’14 రీల్స్’ వారు మాత్రం పరశురామ్ పై మండిపడుతున్నారట. మహేష్ తో సినిమా ఓకే అయితే పర్వాలేదు. కానీ మహేష్ ను .. ఒప్పించడం కూడా చాలా కష్టమే..! సుకుమార్, పూరి జగన్నాథ్, వంశీ పైడిపల్లి వారి వల్లే కాలేదు. మరి పరశురామ్ ఎంతవరకూ సక్సెస్ అవ్వగలడు అనేది మరో ప్రశ్న..! తేడా వస్తే రెండు ప్రాజెక్ట్ లు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus