తమిళనాడులో భారీ కలక్షన్స్ రాబడుతున్న గీత గోవిందం

  • August 20, 2018 / 07:09 AM IST

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గీత గోవిందం రూపంలో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. పరుశురాం దర్శకత్వంలో చేసిన మూవీ ఆగస్టు 15 న రిలీజ్ అయి భారీ కలక్షన్స్ రాబడుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల గ్రాస్ రాబట్టగా మూడు రోజుల్లో 37.45 కోట్ల గ్రాస్ అందుకొని ఔరా అనిపించుకుంది. తొలి వీకెండ్ నాటికీ 50 కోట్ల మెయిలు రాయిని దాటి పరుగులు పెడుతోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులోనూ జోరు ప్రదర్శిస్తోంది. అక్కడ మూడు రోజుల్లోనే 1.79 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం శనివారానికి రెండు కోట్లను అధిగమించి రికార్డు సృష్టించింది.

ఈ ఏడాది తమిళనాడులో ఇంతవరకూ వచ్చిన సినిమాలలో “కడై కుట్టి సింగం” అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఆ స్థానానికి “గీత గోవిందం” గట్టిపోటీని ఇస్తోంది. తమిళనాడులో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి’ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ని కూడా గీత గోవిందం తిరగరాసేట్టు ఉందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటనతో పాటు, హీరోయిన్ గా నటించిన రష్మిక తన అందం, అభినయంతో యువకుల మనసు దోచుకుంటోందని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus