గీత గోవిందం కథ ఇదేనంటూ ప్రచారం

  • August 9, 2018 / 09:55 AM IST

శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మంచి మార్కులు అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ “గీత గోవిందం”. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆకట్టుకుంటోంది. టీజర్ తో పాటు సాంగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లోకి రానుంది. అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ ఫిలిం నగర్లో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. “గోవింద్ (విజయ్ దేవరకొండ) జూనియర్ సైంటిస్ట్ కావాలని గోల్ పెట్టుకుంటాడు. దానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో టైం వేస్ట్ చేయకుండా ఉండటం కోసం ఒక కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పాఠాలు చెప్పే వృత్తిలో దిగుతాడు.

ఆ క్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గీతతో పరిచయమవుతుంది. కానీ పరిచయం ప్రేమ దాకా వెళ్లే లోపే ఇద్దరి మధ్య చిలిపి గొడవలు మొదలవుతాయి. గోవింద్ ను ముందు గీత అపార్ధం చేసుకుంటుంది. ఆ తర్వాత మనసు మార్చుకుంటుంది. తనలోని ప్రేమ విషయాన్ని గోవింద్ కి చెప్పాలనుకునేలోపల ఈగో క్లాషెస్ వస్తాయి. అయినా ఇద్దరూ ఒకరికొకరు విడిపోవాలి అనుకోరు. వీరి ప్రేమ కథ పెళ్లి దాకా ఎలా వెళ్తుంది అనేదే కథ” అని చెప్పుకుంటున్నారు. లైన్ సింపుల్ గా ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశం తాజాగా.. నేచురల్ గా ఉంటాయని చిత్ర బృందం వెల్లడించింది. మరి కథ బాగుందో లేదో అభిమానులు చెప్పడానికి ఎంతోదూరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus