Athadu: మళ్లీ ఫ్యామిలీ కథనే నమ్ముకున్నాడు!

  • April 30, 2021 / 01:29 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో వీరిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలకు పని చేశారు. ‘అతడు’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘ఖలేజా’ కమర్షియల్ వర్కవుట్ కాకపోయినా.. ఇప్పటికీ ఈ సినిమాను ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో

ఈసారి ఎలాంటి కథను ఎన్నుకొని ఉంటారనే విషయంపై ఆసక్తి మొదలైంది. ‘అతడు’ సినిమా మాదిరి ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ‘ఖలేజా’ టైప్ లో మంచి కామెడీ కూడా ఉంటుందట. ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, భారీ యాక్షన్ ఉండేలా త్రివిక్రమ్ కథ రాసుకుంటున్నాడట. అంటే.. మూడోసారి మహేష్ తో త్రివిక్రమ్ తీయబోతున్న సినిమా ‘అతడు’ టైపులోనే ఉంటుందన్నమాట. నిజానికి త్రివిక్రమ్ దగ్గర రివెంజ్ డ్రామా, అలానే పాన్ ఇండియాకు సరిపోయే కథలు ఉన్నాయి.

కానీ వాటిని పక్కన పెట్టి మహేష్ కోసం ఫ్రెష్ గా స్టోరీ రాసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి వీరి ప్లాన్స్ అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయో లేదో చూడాలి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus