‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) తర్వాత అనుష్క (Anushka) నుండి మరో సినిమా రాలేదు. కొంత గ్యాప్ తీసుకుని క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటి’ (Ghaati) చేసింది. గతంలో వీరి కాంబినేషన్లో ‘వేదం’ (Vedam) అనే క్లాస్ సినిమా వచ్చింది. అది క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.
ముఖ్యంగా అనుష్క (Anushka) పోషించిన సరోజ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.స్టార్ డమ్ సంపాదించుకున్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన పాత్ర చేయడం అంటే.. చిన్న విషయం కాదు. అనుష్క (Anushka) వల్ల ‘వేదం’ (Vedam) మరింత స్పెషల్ అయ్యింది. ఇక దాదాపు 14 ఏళ్ళ తర్వాత క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క చేసిన ‘ఘాటి’ (Ghaati) కూడా వైవిధ్యమైన సినిమానే. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాలి.
కానీ కొన్ని కారణాల వల్ల జూలై 11న రిలీజ్ కాబోతోంది.ఇదిలా ఉండగా.. ‘ఘాటి’ (Ghaati) సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ తో రూపొందించారట. అప్పుడే ఈ సినిమా రికవరీ కూడా సాధించినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లకు జరిగిందట. ఇక ఓటీటీ, డబ్బింగ్, ఆడియో వంటి రైట్స్ రూపంలో రూ.38 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది.