ఈ పరిస్థితుల్లో పెళ్ళి చేసుకోవడం అవసరమా?

  • April 17, 2020 / 02:14 PM IST

అసలే కరోనా ఎఫెక్ట్ ఉంది.. అందులోనూ లాక్ డౌన్ కూడా..! మే 3 వరకూ ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది అని ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ఫ్యూ విధించడం కూడా జరిగింది. ఒక్క మెడికల్ షాప్ లు … నిత్య అవసరాలకు సంబందించిన కొన్ని స్టోర్స్ తప్ప ఏవీ ఓపెన్ లో ఉండటం లేదు. ఇలాంటి టైములో ఎక్కువ మంది జనాలు కూడా గుంపులుగా కూడుకో కూడదు అని ఆదేశాలు కూడా జారీచేసింది ప్రభుత్వం.

ఇలాంటి టైం వివాహాలు కూడా కొద్ది మంది జనాల మధ్యలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అయితే పెళ్ళి అంటే జీవితంలో ఒక్కసారే చేసుకునేది కాబట్టి.. గ్రాండ్ గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో నితిన్ తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. మరి నిఖిల్ ఎలా పెళ్ళి చేసుకున్నాడు… అని షాక్ ఆవ్వకండి.పెళ్ళి జరిగింది మన నిఖిల్ కు కాదు.. కన్నడ హీరో.. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి గౌడ త‌న‌యుడు నిఖిల్ గౌడ కు పెళ్ళి జరిగింది.

‘జాగ్వార్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నిఖిల్ గౌడ. అతని పెళ్ళి కన్నడంలో పాపులర్ పొలిటికల్ లీడర్ కూతురు రేవతి తో వివాహం తాజాగా జరిగింది. నిజానికి వీళ్ళ పెళ్ళి చాలా గ్రాండ్ గా చెయ్యాలి అనుకున్నారు.. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల .. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొద్ది పాటి బందు మిత్రుల మధ్యలో సామజిక దూరం పాటిస్తూ అన్ని భద్రతలు తీసుకుంటూ వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య పెళ్ళి చేసుకోవడం అవసరమా అని కామెంట్లు చేసే వారు కూడా ఉన్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus