‘ఆచార్య’ లో చరణ్ సరసన నటించే హీరోయిన్ ఫిక్స్..!

  • September 9, 2020 / 11:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ తో సినిమా కథ పై ఒక అవగాహన వచ్చేలా చేశారు.అందువల్ల స్టోరీ గురించి వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే.! ఇక ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై రాంచరణ్, నిరంజన్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లోపు విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట త్రిష ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆమె క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ తప్పుకోవడం వల్ల.. ఆమె ప్లేస్ లో కాజల్ ను తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ‘ఆచార్య’ లో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు కొరటాల శివ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో 30 నిమిషాల నిడివి గల ఈ పాత్రకు… జోడీగా హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయం పై కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్ కు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ రష్మిక మందన ను అనుకుంటున్నట్టు సమాచారం. ఈమెనే ఫైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇది నిజమే అయితే రష్మిక.. బ్యాక్ టు బ్యాక్ మెగాహీరోల సరసన నటించబోతున్నట్టే..! ఎందుకంటే.. ఇప్పటికే ఈమె అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో కూడా ఎంపికైంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus