చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ అందుకున్న బ్యూటీ

  • August 8, 2018 / 07:15 AM IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమాతో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న కొరటాల ప్రతిభని మెచ్చుకొని అతని దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. భరత్ అనే నేను సినిమా తర్వాత విదేశాల్లో విహారానికి వెళ్లిన కొరటాల.. ఫ్రెష్ మైండ్ తో హైదరాబాద్ కి వచ్చి స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు.

ఈ పనుల్లో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అందుకే ఆర్టిస్టుల సెలక్షన్ మొదలు పెట్టారు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఆమెను ముందు సెలక్ట్ చేసేస్తే పెద్ద పని అయిపోతుందని భావించిన కొరటాల.. హీరోయిన్స్ పై దృష్టిపెట్టారు. సీనియర్ హీరోయిన్స్ అనుష్క, త్రిష, శ్రియ పేర్లు పరిశీలించారు. త్రిష, శ్రియలో చిరుతో ఇదివరకే కలిసి నటించి హిట్స్ అందుకున్నారు. అనుష్క ఓ పాటలో నర్తించింది కానీ హీరోయిన్ గా చేయలేదు. ఖైదీ నంబర్ 150 , సైరా లోను ఆమె పేరు అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ సారి మాత్రం సెట్ అయినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అనుష్క కథ వినడం, ఓకే చెప్పడం జరిగిపోయాయంట. సంతకాలు పూర్తికాగానే అధికారిక ప్రకటన రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus