భారీ తనం నింపుకుంటోన్న బోయపాటి, చరణ్ మూవీ

  • February 7, 2018 / 07:12 AM IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ రెండు రోజుల్లో పూర్తి కానుంది. దీని తర్వాత చెర్రీ బోయపాటి శ్రీను సినిమాని పట్టాలెక్కించనున్నారు. వీరిద్దరికలయికలో రూపుదిద్దుకోనున్న మాస్ యాక్షన్ చిత్రంలో అలనాటి నటి, బాపు బొమ్మ స్నేహ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు అనన్య (‘జర్నీ’ ఫేం), చరణ్ కి వదినులుగా కనిపించనున్నారు. తాజాగా అన్నలుగా నటించడానికి ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ హీరో), నవీన్‌ చంద్ర(అందాల రాక్షసి)లు చరణ్ అన్నయ్యలుగా ఖరారు అయ్యారు.

ఇప్పటికే ఇందులో బాలీవుడ్ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా నటించడానికి ఒకే చెప్పారు. సో ఇందులో చరణ్ తో పాటు మరో ముగ్గురు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నమాట. ఇలా సినిమా ప్రారంభానికి ముందే బోయపాటి అంచనాలను పెంచేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఖరారైన ఈ చిత్రం ఎక్కువ భాగం రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రంలో చరణ్ రాజ వంశస్థుడిగా కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus