విశాల్ సినిమాకి షాకిచ్చిన హైకోర్టు.. మ్యాటర్ అదే..!

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో విశాల్. ఇతని సినిమాలకు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంటాడు కాబట్టి.. ఇక్కడి బయ్యర్లు ఎక్కువ రేట్లు పెట్టి మరీ అతని సినిమాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో అతను నటించిన ‘అయోగ్య’ ‘యాక్షన్’ వంటి చిత్రాలు పెద్దగా ఆడలేదు కానీ.. అంతకు ముందు వచ్చిన ‘డిటెక్టివ్’ ‘అభిమన్యుడు’ ‘పందెం కోడి2’ చిత్రాలు బాగా ఆడాయి.

ఇదిలా ఉండగా.. అతను నటించిన తాజా చిత్రం ‘చక్ర’ ను ఫిబ్రవరి 19న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ చిత్రానికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. వివరాల్లోకి వెళితే..’చక్ర’ కథ పై పూర్తి హక్కులు మావే అంటూ..ప్రముఖ నిర్మాత రవి మద్రాసు హైకోర్టుకెక్కాడు. దాంతో విశాల్ సినిమాకి పెద్ద ఇబ్బంది ఎదురైంది. పిటీషన్ ను విచారించిన కోర్టు సినిమా విడుదల పై స్టే ఇవ్వడం అందరికీ షాకిచ్చే అంశం.

తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.కానీ ఫిబ్రవరి 19నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇక శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా కీలక పాత్ర పోషించింది. ఎం.ఎస్‌.ఆనందన్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని విశాల్ నిర్మించాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus