అనాథ పిల్లిని దత్తత తీసుకున్న శేష్, రేణు దేశాయ్ : ‘ఆది పురుష్’ మొదలైంది : మరో రీమేక్ పై కన్నేసిన మెగాస్టార్

  • February 2, 2021 / 07:03 PM IST

టాలీవుడ్ హీరో అడివి శేష్ ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు పై ఉన్న ఒక పిల్లిని చూసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాడట. చలితో వణికిపోతున్న ఆ పిల్లి … ట్రాఫిక్ లో ఎటు వెళ్లాలో తెలీక ఇబ్బంది పడుతుంటే ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టాడట.ఈ విషయం పై స్పందించిన నటి రేణు దేశాయ్.. శేష్ కు థాంక్స్ చెప్పింది. అంతేకాకుండా ఆ పిల్లిని తాను దత్తత తీసుకుంటానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

‘రాధే శ్యామ్’ తరువాత… ప్రభాస్ తన తదుపరి సినిమా అయిన ‘ఆది పురుష్’ , ‘సలార్’ ల పై దృష్టి పెట్టాడు. ఓం రౌత్ ఆది పురుష్ ను అలాగే ప్రశాంత్ నీల్.. సలార్ ను తెరకెక్కించనున్నారు. ఈ మధ్యనే ‘సలార్’ చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఇక ఈరోజున ‘ఆది పురుష్’ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. త్వరలోనే ‘ఆది పురుష్’ నుండీ ప్రభాస్ లుక్ విడుదల కాబోతున్నట్టు కూడా సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ పై కన్నేశారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రం షూటింగ్లో బిజీగా గడుపుతోన్న చిరు అటు తరువాత మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్లో కూడా నటించనున్నారు. దాంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ లో కూడా నటిస్తానని చిరు ప్రకటించారు. ఇప్పుడు ‘ఎన్నై అరిందాల్’ చిత్రాన్ని కూడా రీమేక్ చెయ్యడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ చిత్రం ఆల్రెడీ తెలుగులో ‘ఎంతవాడు గాని’ పేరుతో రీమేక్ అయ్యింది. అయినప్పటికీ చిరు ఈ చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి రీమేక్ చెయ్యాలని భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో దర్శకుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం.


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus