‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఫిక్స్ : సంక్రాంతికే ‘సర్కారు వారి పాట’ : అనసూయ ఐటెం సాంగ్ తో ‘చావు కబురు చల్లగా’

  • January 29, 2021 / 06:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి మరియు రాంచరణ్ లు కలిసి నిర్మిస్తున్నారు. చరణ్ కూడా ఈ చిత్రంలో 40నిమిషాల నిడివిగల సిద్ద అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కొద్ది గంటల క్రితమే విడుదల చేశారు. అంతేకాకుండా మే 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 2020 సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. మళ్ళీ సంక్రాంతికే రాబోతుండడం విశేషం.

‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’.’జి.ఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదల చేసిన టీజర్లకు కూడా మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ ఐటమ్ ఓ ఐటెం సాంగ్ చెయ్యబోతుందట. ఈ పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్.


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus