భారీ ధర పలికిన భరత్ అనే నేను సినిమా హక్కులు

  • February 28, 2018 / 01:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు రెండోసారి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా ఫస్ట్ ఓత్ జనవరి 26 న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్న ఈ మూవీ టీజర్ (భరత్ విజన్ )ను మార్చి 6 న విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఇండస్ట్రీ హిట్ శ్రీమంతుడు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆంధ్రా థియేటర్ హక్కులను దాదాపు 22 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ రేట్ చూస్తూనే.. సినిమాపై ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది.

“భరత్ అనే నేను” చివరి షెడ్యూల్ మార్చిలో జరగనుంది. 16 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో మిలిగిన ఒక పాటతో పాటు, సన్నివేశాలను కంప్లీట్ చేయనున్నారు. దీంతో ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచి.. ఏప్రిల్ 20న సినిమా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. శరత్‌కుమార్‌, ప్రకాశ్‌రాజ్‌, ఆమని, సితార, పోసాని కృష్ణమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం స్వరపరిచిన ట్యూన్స్ వినాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus