అఖిల్, విక్రమ్ మూవీలో ఫైట్ సీక్వెన్స్ కి భారీ ఖర్చు

  • June 9, 2017 / 11:53 AM IST

అక్కినేని ఫ్యామిలీ చిత్రం “మనం”లో అఖిల్ ని గ్రాండ్ గా చూపించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఇప్పుడు అతను కొత్త మూవీ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లోని మెట్రో ట్రైన్, స్టేషన్ లో షూట్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ నేపథ్యంలో ఈ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం నిర్మాత అక్కినేని నాగార్జున 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొడుకుకి మంచి హిట్ ఇవ్వాలని తండ్రి పడే తపన చూసి ఔరా అంటున్నారు. మొదటి షెడ్యూల్ కే ఇంత ఖర్చు అయితే, సినిమా పూర్తి అయ్యే నాటికీ 40 కోట్లు మించి పోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయినా అంత ఖర్చుపెట్టేందుకు నాగ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో నిర్మితమవుతున్న ఈ సినిమాకి “జున్ను”, “ఎక్కడ ఎక్కడ ఉందో తారక” అనే రెండు పేర్లు పరిశీలిస్తున్నారు. ఇందులో కూడా మరో  బాలీవుడ్ బ్యూటీ అలియా బట్ ని హీరోయిన్ గా తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం చేయడానికి అఖిల్ భావిస్తున్నారు. ఈనెల 12 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టేందుకు విక్రమ్ కుమార్ అంతా సిద్ధం చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus