Shankar, Ram Charan: శంకర్ చరణ్ మూవీకి హైలెట్ సీన్ ఇదే?

  • September 22, 2021 / 02:24 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్, చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. శంకర్ సినిమాలలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయనే సంగతి తెలిసిందే. చరణ్ శంకర్ కాంబో మూవీకి ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. సినిమాలో ఒక్క సీన్ కోసం నిర్మాత దిల్ రాజు ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాల్లో ట్రైన్ సీన్స్ ఉండగా ఈ సినిమాలో కూడా ట్రైన్ సీన్ ఉంటుందని ఈ సీన్ లో చరణ్ వందల మంది ఫైటర్లతో ఫైట్ చేస్తారని సమాచారం. ఈ సన్నివేశాన్ని ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అంజలి, సునీల్, జయరామ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శంకర్ చరణ్ తో తెరకెక్కించే సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని భావిస్తున్నారు. దాదాపుగా రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. రామ్ చరణ్ హీరోయిజాన్ని ప్రదర్శించేలా ట్రైన్ సీన్ ఉంటుందని సమాచారం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus