భారీ కలక్షన్స్ దిశగా దూసుకుపోతోన్న యు టర్న్, శైలజా రెడ్డి అల్లుడు!

  • September 17, 2018 / 10:26 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో ఇది వరకూ ఎప్పుడూ జరగని విధంగా భార్య భర్తలు సమంత, నాగ చైతన్యలు తమ సినిమాల్తో ఒకే రోజు పోటీకి దిగారు. తమపై నమ్మకంతో.. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేసి వినాయకచవితి రోజు యు టర్న్, శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ చేశారు. ఇవి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ భారీ కలక్షన్స్ దిశగా దూసుకుపోతున్నాయి. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని అక్కినేని కోడలు సమంత  “యు టర్న్” గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.  పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ రోల్ పోషించింది. భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లో (గురు, శుక్ర, శని) 14కోట్ల గ్రాస్ ను సాధించి ఔరా అనిపించింది.

ఇక మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చైతూ నటనకి తోడు అత్తగా రమ్యకృష్ణ, ఆమె కూతురిగా అను ఇమ్యానుయేల్ చక్కగా నటించి అభినందనలు అందుకుంటున్నారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం కూడా దాదాపు 7 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. అంటే ముప్ఫైకోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus