Chiru, Puri: మెగాస్టార్ నమ్మకాన్ని పూరీ నిలబెట్టుకుంటారా?

  • January 2, 2023 / 02:04 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు కేవలం 3 నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి నటించే సినిమా ఏదనే ప్రశ్నకు చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందనే సమాధానం వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లైగర్ సినిమాతో విమర్శలపాలైన పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ కు ఈ సినిమానే కీలకమని చెప్పవచ్చు.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే మాత్రమే పూరీ జగన్నాథ్ కు డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది. లైగర్ మూవీతో పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరతారని అభిమానులు ఆశించగా అందుకు భిన్నంగా జరగడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ దేవరకొండ మార్కెట్ ను మించి ఖర్చు చేయడంతో లైగర్ మూవీకి భారీ స్థాయిలో నష్టాలు మిగిలాయి. నిర్మాతగా కూడా లైగర్ మూవీ పూరీ జగన్నాథ్ కు భారీ షాకిచ్చింది.

లైగర్ సినిమా రిజల్ట్ వల్ల పూరీ జగన్నాథ్ కు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూరీ జగన్నాథ్ ఇకపై సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటే మంచిదని కొంతమంది చెబుతున్నారు. నిర్మాతగా, దర్శకునిగా పూరీ జగన్నాథ్ రెండు పడవల ప్రయాణం చేయొద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటే ఇతర సీనియర్ హీరోలు సైతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించాలని భావిస్తున్నారు.

కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లను సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేయడం కష్టం కాదని కొంతమంది భావిస్తున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus