ఎన్టీఆర్ సినిమాపై కన్నేసిన డిస్ట్రిబ్యూటర్లు

  • March 2, 2017 / 08:13 AM IST

జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ 130 కోట్లు వసూలు చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు తారక్ సినిమాపై కన్నువేసారు. లాభాల గని అయిన యంగ్ టైగర్ మూవీ థియేటర్ హక్కులను కొనేందుకు రెడీగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఓ బడా డిస్ట్రిబ్యూటర్ ఎన్టీఆర్ 27 ఫిల్మ్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను మొత్తంగా సొంతం చేసుకోవడానికి ముందుకు వచ్చారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ లో తారక్ పాల్గొనకముందే  భారీ ఆఫర్ తో ఊరించారు. 85 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తానని నిర్మాత కళ్యాణ్ రామ్ ని ఆ బిగ్ షాట్ అడిగారని ఫిల్మ్ నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బ్యానర్లో బడ్జెట్ లెక్క చేయకుండా నిర్మిస్తున్న ఈ మూవీ బిజినెస్ గురించి ఇప్పుడే మాట్లాడనని నిర్మాత చెప్పినట్లు సమాచారం. జై లవ కుశ అనే పేరు పరిశీలిస్తున్న ఈ మూవీలో తారక్ మూడు పాత్రల్లో నటవిశ్వరూపం చూపించనున్నారు. ఎన్టీఆర్ నటనలో వేరియేషన్స్ మాత్రమే కాకుండా బాడీలోను మార్పులు కనిపించాలని హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తీసుకున్నారు. ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ పనిచేస్తున్నారు. వరుసగా మూడోసారి ఎన్టీఆర్ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus