నాకంటే మంచి పాత్రలు వేరే హీరోయిన్లు చేస్తే కుళ్లుకుంటాను: పూజా హెగ్డే

  • September 3, 2019 / 08:13 AM IST

“స్వార్ధం”.. నేటితరం మనుషుల్లో ఇన్బుల్ట్ యాప్ లాంటిదది. సాధారణ జనాల్లోనే భారీ స్థాయిలో ఉండే ఈ స్వార్ధం.. సెలబ్రిటీలకు ఇంకాస్త ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆ స్వార్ధానికి తాను పెద్ద మినహాయింపు ఏమీ కాదని చెబుతోంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఆల్రెడీ మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన పూజా హెగ్డే కుళ్లుకోవాల్సిన అవసరం ఏముందని అడగొచ్చు కానీ.. పూజా హెగ్డే కుళ్లుకొనేది స్టార్ హీరోల సరసన అవకాశాల గురించి కాదట. చిన్న-పెద్ద అనే తేడా లేకుండా ఏ సినిమాలోనైనా ఒక నటికి మంచి పాత్ర లభించి.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తే.. ఆ పాత్రను నేను చేయలేకపోయానే అని కుళ్లుకుంటుందట పూజా. అలాగే.. సదరు నాటికి ఫోన్ చేసి మరీ అభినందిస్తుందట.

పూజా హెగ్డే తాజా చిత్రం “వాల్మీకి” సెప్టెంబర్ 20కి రెడీ అవుతుండగా.. ప్రభాస్ సరసన నటిస్తున్న “జాన్” వచ్చే ఏడాది విడుదలకానుంది. ఈ రెండు సినిమాలు కాకుండా ఆమె హిందీలో నటించిన “హౌస్ ఫుల్ 4” కూడా వచ్చే ఏడాదికి విడుదలకానుంది. ఇలా క్రేజీ ప్రొజెక్ట్స్ తో యమ బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇంకొన్ని క్రేజీ సినిమాలు ఆల్రెడీ సైన్ చేసింది. చూస్తుంటే.. దరిదాపుల్లో పూజా హెగ్డే కెరీర్ స్లో అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus