రోజుకి కోటి ఇచ్చినా ఎన్టీఆర్ సినిమాలో నటించనన్న పోసాని

  • July 5, 2017 / 10:35 AM IST

ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడి తెలుగు పరిశ్రమలో ఒక గుర్తింపు తెచ్చుకున్న రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఈసారి ఎన్టీఆర్ సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత గాధను ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు. దీనికి రామ్ గోపాల్ వర్మను దర్శకుడిగా సెలక్ట్ చేశారు. ఎన్టీయార్‌ జీవితంలోని వివాదాల వెనకున్న అసలు కాంట్రవర్సీని చూపిస్తానని ప్రకటించాడు వర్మ. దీంతో టాలీవుడ్ లో ఈ విషయంపై చర్చ మొదలయింది. వివాదాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ని డైరక్ట్ చేయడమేమిటని బహిరంగంగానే చాలామంది విమర్శిస్తున్నారు.

ఈ విషయంపై పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రజలకు ఎన్టీయార్‌ ఎవరెస్ట్‌ లాంటి వ్యక్తి. ఆయన మీద ఎలాంటి మచ్చ పడినా అభిమానులు తట్టుకోలేరు. ఆయనను కించపరిచేలా సినిమా తీస్తే జనాలు వెంటపడి మరీ కొడతారు. అందువల్ల ఈ బయోపిక్‌ తీయాలనే ఆలోచనను విరమించుకోవాలి. ఇలాంటి సినిమాలో రోజుకు కోటీ ఇస్తామన్నా నేను నటించను’అని పోసాని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. ఆయన మాటలకు నందమూరి అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus