సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఇలియానాకి తగ్గని క్రేజ్!

  • October 20, 2018 / 12:39 PM IST

వైన్ బాటిల్ కి వయసు పెరిగే కొద్దీ రేటు పెరుగుతుందట. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ల పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ ఆఫర్లు, క్రేజ్ తోపాటు రెమ్యూనరేషన్ కూడా పెరుగుతోంది. నిన్నమొన్నటివరకూ కాజల్, నయనతార, త్రిష మాత్రమే ఉన్న ఈ లిస్ట్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. “దేవుడు చేసిన మనుషులు” తర్వాత టాలీవుడ్ కి గుడ్ బై చెప్పిన ఈ బెల్లీ బ్యూటీ చాలాకాలం తర్వాత “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రంతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి అమ్మడి క్రేజ్ తగ్గిందనుకొన్నారు చాలామంది.

కట్ చేస్తే.. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ తో క్రీజ్ లో ఉన్న హీరోయిన్స్ కంటే డబుల్ రెమ్యూనరేషన్ తీసుకొందని తెలుస్తోంది. “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రానికి ఇలియానా ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొందట. ఆల్మోస్ట్ ఆరేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఓ కథానాయిక ఈస్థాయి రెమ్యూనరేషన్ అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. సరిగ్గా ఇదే ఫ్లోలో ఇలియానా ఇంకో రెండుమూడు ప్రొజెక్ట్స్ అందుకోగలిగిందంటే.. ఈజీగా మళ్ళీ అగ్రకథానాయిక స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus