ఇలియానాకు పునః స్వాగతం పలికిన ‘AAA’ టీమ్

  • June 28, 2018 / 09:22 AM IST

దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియాన పోకిరితో యువకుల హృదయాలను గిలిగింతలు పెట్టింది. వరుస విజయాలతో అతి తక్కువకాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిన ఈ గోవా బ్యూటీ బాలీవుడ్ లో అవకాశం రాగానే ముంబై లో మకాం వేసింది. గత ఐదేళ్ళలో ఐదు చిత్రాలను మాత్రమే చేసిన ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కష్టపడింది. తనకి కిక్ వంటి అద్భుత విజయాన్ని ఇచ్చిన హీరోతో నటించే ఛాన్స్ అందుకుంది. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” సినిమా చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అమెరికాలో సాగుతోంది. ఇందులో రవితేజతో పాటు ఇలియానా కూడా పాల్గొంటోంది. అయితే ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఇలియానాకు ట్విట్టర్ వేదికపై పునః స్వాగతం పలికారు.”నువ్వు మళ్లీ తెలుగు సినిమా చేస్తుండడం చాలా ఆనందంగా ఉంది ఇలియానా” అంటూ `అమర్ అక్బర్ ఆంటోని` తరఫున స్వాగతం పలికారు. పూర్తి వినోదాన్ని పంచనున్న ఈ మూవీ దసరాకి థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus