Uppena Movie: ‘నీ కళ్లు నీలి సముద్రం…’ శ్రీమణి ఏమన్నారంటే?

  • May 23, 2021 / 09:56 PM IST

సంగీతం, పాటలు ప్రేక్షకుణ్ని థియేటర్‌ దగ్గరకు తీసుకొస్తాయి అని మనకు తెలియజేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో దీనిని నిరూపించిన సినిమాలు అంటే ‘అల వైకుంఠపురములో…’, ‘ఉప్పెన’ అని చెప్పొచ్చు. మొదటి సినిమా గురించి, అందులో పాటల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక రెండో సినిమా గురించి, అందులో పాటల గురించి చెప్పాలంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట ‘నీలి కళ్లు నీలి సముద్రం…’ పాట. సినిమా రిలీజ్‌కు సంవత్సరం ముందే ఈ పాట విడుదల చేశారు. సినిమా విడుదలయ్యేవరకు ఈ పాట వినిపిస్తూనే ఉంది. సినిమా వచ్చి హిట్‌ అయిన తర్వాత… ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. మరి అలాంటి హిట్‌ పాట గురించి ఆ గీత రచయిత శ్రీమణి ఏమన్నారో తెలుసా?

హీరో తన మనసులో దాచిన ప్రేమను చూపించే పాట కోసం చర్చలు మొదలయ్యాయట. దానికి గోదావరి జిల్లాల్లో ప్రాముఖ్యం ఉన్న ముస్లిం బషీర్‌బేబీ తిరునాళ్ల నేపథ్యం అనుకున్నారు. దాంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఖవాలి’ శైలిలో సంగీతం ఇచ్చారట. దీంతో ఓ హిందీ పల్లవి రాయించి, పాడించారట. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌ ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అంటూ పల్లవి చెప్పారు. ఇక ఆ పాటను పూర్తి చేసే పని శ్రీమణికి ఇచ్చారట. కథకు తగ్గట్టూ హీరో దాచుకున్న ప్రేమను చెప్పాలి. అయితే అందరికీ అర్థమయ్యే సులభమైన పదాలు ఉండాలి. అలా ఈ పాట రాయడం శ్రీమణి మొదలుపెట్టారట.

తొలి ప్రేమ అనగానే శ్రీమణికి వరుసగా చరణాలు వచ్చేశాయట. అలా అవి ఎనిమిది వరకు సిద్ధమయ్యాయట. అందులోంచి సంగీత దర్శకుడు నచ్చినవి ఎంచుకున్నారట. అలా చరణాలు పూర్తయ్యాక పల్లవి మీదకు వచ్చార శ్రీమణి. ‘నీ కన్ను నీలి సముద్రం…’ ఇచ్చిన దేవిశ్రీ ఇచ్చిన పదాలకు ‘నీ నవ్వు ముత్యాలహారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం’ అని కలిపారట. అలా పాట సిద్ధమైందట. పాట విన్నవెంటనే దర్శకుడు బుచ్చిబాబు, సుకుమార్‌కి బాగా నచ్చిందట. ఆ తర్వాత అందరూ లూప్‌లో వినే పాట అయిపోయింది. ఇదంతా చదివాక మళ్లీ ఈ పాట వినేయాలనుందా. ఇంకేం ఆలస్యం వినేయండి మరి.


టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus