Nayanthara: కాంట్రవర్శీ సినిమాకు కొత్త దర్శకుడు.. ఈసారి ఏమవుతుందో?

  • August 13, 2024 / 09:30 AM IST

నయనతార (Nayanthara) ఇటీవల కాలంలో చేసిన కొన్ని సినిమాలు అనుకోకుండా రిస్క్‌లోకి వెళ్తున్నాయి. కథలో ఉన్న అంశాలో, ప్రచారంలో భాగంగా చేసిన విషయాలు ఆమెను ఇబ్బందుల్లోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత చాలా చర్చలు, ఉప చర్చలు, దిద్దుబాటు చర్యల వల్ల సమసిపోతున్నాయి. కొన్ని ఇంకా సమసిపోలేదు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నయన్‌ ఓ రిస్క్‌ చేస్తోంది. గతంలో ఇబ్బందులు తెచ్చి పెట్టిన సినిమాకు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. నయనతార నుండి వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్‌’ ఒకటి.

Nayanthara

తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో వచ్చింది. కరోనా సమయంలో ఓటీటీలో స్ట్రీమ్‌ అయిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘అమ్మోరు తల్లి 2’ సిద్ధం చేయాలని చూస్తున్నారు. తొలి సినిమాను ఆర్‌జే బాలాజీ (RJ Balaji) , ఎన్‌.జె.శరవణన్‌ డైరెక్ట్‌గా చేయగా.. ఈసారి దర్శకుడిగా సి.సుందర్‌ (Sundar C)వ్యవహరించనున్నట్లు సమాచారం. ‘బాక్‌’ (BAAK) ‘అరణ్మనై 4’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన సుందర్‌ ‘మూకుత్తి అమ్మన్‌ 2’ చేయడానికి ఓకే చెప్పారు అని సమాచారం.

అయితే ఆయన ప్రస్తుతం వడివేలు ప్రధాన పాత్రలో ఓ సినిమా తీస్తున్నారు. అది పూర్తి కాగానే నయన్‌ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. తొలి పార్ట్‌ను మించేలా భారీ బడ్జెట్‌తో ‘మూకుత్తి అమ్మన్‌’ రెండో పార్టు తెరకెక్కిస్తారట. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో షూట్‌ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా అనౌన్స్‌మెంట్‌ను ఆ ప్రోమోతోనే చేస్తారు అని చెబుతున్నారు. అయితే ‘అన్నపూరణి’ సినిమాతో ఇటీవల నయన్‌ లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంది.

అందులో చూపించిన కొన్ని అంశాలు.. చూపించిన విధానమే దానికి కారణం. ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో అలాంటి పరిస్థితే వస్తుందేమో అని ఆమె అభిమానులు ఆందోన చెందుతున్నారు. మరికొందరైతే చేతిలో పది సినిమాలు పెట్టుకున్న నయన్‌ ఈ సినిమా ఎందుకు చేయడం అంటున్నారు. అయితే ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాలో చెప్పిన విషయాలు, చర్చించిన అంశాలు అలాంటివి మరి. అందుకే ఆమె ఆసక్తి చూపిస్తోంది అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus