ఏ ముహూర్తాన సాయిపల్లవి బాలీవుడ్కి వెళ్లిందో కానీ.. అక్కడి నుండి వరుస సినిమా ఛాన్స్లు వస్తూనే ఉన్నాయి. ఒక సినిమా కూడా ఇంకా విడుదల కాక ముందు, ఇంకా ప్రచారం కూడా పూర్తి స్థాయిలో షురూ కాక ముందే మరో సినిమా పనులు పూర్తి చేసిన కథానాయిక ఆమె. ఇప్పుడు మూడో సినిమాకు కూడా ఓకే అంది అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగిత ప్రఖ్యాత నటీమణి మధుబాల పాత్రలో సాయిపల్లవిని మనం చూస్తాం. ఎందుకంటే ఆమె జీవిత చరిత్రలోనే సాయిపల్లవి ఇప్పుడు నటించబోతోందని సమాచారం.
మలయాళ సినిమా నాయికగా కెరీర్ ప్రారంభించిన సాయిపల్లవి ఆ తర్వాత తెలుగు, తమిళం అంటూ వరుస భాషల్లో సినిమాలు చేస్తూ వస్తోంది. సౌత్ అయిపోయింది కదా.. ఇప్పుడు బాలీవుడ్లో సినిమాలు మొదలుపెట్టింది. ‘ఏక్ దిన్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించనున్న సాయిపల్లవి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పింది అని టాక్. ఆయన తెరకెక్కించనున్న నటి మధుబాల బయోపిక్ కోసమే ఆ కాంబో అని సమాచారం.
మధుబాల బయోపిక్ కోసం సంజయ్ లీలా భన్సాలీ చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తొలుత కియారా అడ్వాణీ, అనీత్ పడ్డా లాంటి పేర్లు వినిపించాయి. అయితే సాయిపల్లవి పేరు దాదాపు ఫిక్ష్ అయ్యారట. ప్రస్తుతం సాయిపల్లవి ‘రామాయణ’ సినిమా పనుల్లో ఇటు ముంబయి, అటు ధనుష్తో చేయబోయే సినిమా కోసం చెన్నై అంటూ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ‘మధుబాల’ సినిమా ఓకే అంటే ఎక్కువ రోజులు ముంబయిలోనే ఉంటుందని చెప్పొచ్చు.
‘పద్మావత్’, ‘గంగూబాయి కాఠియావాడి’ లాంటి చిత్రాలతో రీసెంట్గా తానేంటో చూపించిన సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండి’ వెబ్సిరీస్తో రీసెంట్గా మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు మధుబాల లాంటి మేటి నటి జీవిత చరిత్రను సినిమాగా చేస్తున్నారు అంటే అందులో చాలా స్పెషల్ ఉంటుంది. అందుకే సాయి పల్లవి ఓకే చెప్పింది అని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్.