Samantha: ఓటీటీ తెలుగు హీరోయిన్స్‌కు అచ్చిరాదా?

  • April 25, 2021 / 02:33 PM IST

మన దేశంలో ఓటీటీ ప్రవేశించి చాలా రోజులైనా ఊపు వచ్చింది మాత్రం కరోనా కారణంగానే. కరోనా తొలి వేవ్‌ రోజుల్లో ప్రజలు ఇళ్లలో ఉండి ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ తమ ప్రతిభ చూపించే మన సినిమా జనాలు ఓటీటీలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మన హీరోయిన్లు. అలా టాలీవుడ్‌ నుండి చాలా మంది నాయికలు ఓటీటీలవైపు వెళ్లారు. అయితే టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ ఎలా కలసిరాలేదో… ఓటీటీ ప్రయత్నం కూడా అలానే కలసిరావడం లేదు.

టాలీవుడ్‌ నుండి ఓటీటీలవైపు వెళ్లినవారి జాబితా తీసుకుంటే… ముందుగా కాజల్‌ అగర్వాల్‌ గురించి చెప్పుకోవాలి. ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’ పేరుతో డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చేసింది. ఏడు భాషల్లో విడుదలైన ఈ సిరీస్‌ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నెట్‌ఫ్లిక్స్‌ ‘పిట్టకథలు’ చేసింది. హిందీ ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తెలుగులో ఇలా తీసుకొచ్చారు. అయితే ఇది కూడా బోల్తా కొట్టింది. హిందీలో అంత పేరు తెచ్చుకున్న సిరీస్‌ ఇక్కడ జనాలకు కనెక్ట్‌ అవ్వలేదు. ఆ తర్వాత తమన్నా రెండు సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఆహా’లో వచ్చిన ‘11th అవర్‌’ నిరాశపరిచింది. అయితే తమన్నా ఆహా కోసం ఇంకో సిరీస్‌ చేయబోతోంది అన్నది టాక్.

ఇక టాలీవుడ్‌లో మిగిలింది సమంత మాత్రమే. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌లో సమంత నటించింది. ఈ సిరీస్‌ ఇప్పటికే ‘డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌’ విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల నిర్మాణ సంస్థ విడుదల వాయిదా వేసింది. త్వరలో విడుదల చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాజల్‌, తమన్నా, శ్రుతి హాసన్‌ వల్ల కానిది… సమంత వల్ల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్లు నాగ్‌ అశ్విన్‌ డైరక్షన్‌లో శ్రుతి మరో వెబ్‌ సిరీస్‌ చేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. మరి అదెప్పుడు వస్తుందో?

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus