ఏ చిత్రానికి జై లవకుశ కాపీ కాదన్న నిర్మాత

  • June 7, 2017 / 01:44 PM IST

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్  చేస్తున్న జై లవకుశ  సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. దర్శకుడు బాబీ తారక్ ని మూడు రకాలుగా చూపించడానికి శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వీర విహారం చేస్తోంది. అది ఏమిటంటే.. తమిళంలో అజిత్ చేసిన ‘వరలారు’ అనే సినిమా స్టోరీని అటు ఇటు మార్చి బాబీ కథను సిద్ధం చేశారని కొంతమంది విమర్శిస్తున్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో అజిత్ మూడు పాత్రలను పోషించారు. 2006లో వచ్చిన ‘వరలారు’ ఆర్ధికంగా విజయం సాధించడమే కాదు.. అజిత్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ పాత్రలనే ఎన్టీఆర్ పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలు అవాస్తవమని చిత్ర బృందం ఎన్ని సార్లు చెప్పినా గాసిప్ ఆగడం లేదు. దీంతో నిర్మాత కళ్యాణ్ రామ్ మీడియా ముందుకు వచ్చారు. ” వరలారు సినిమా కథకు జై లవకుశ కథకు ఎటువంటి సంబంధం లేదు. ఏ చిత్రానికి ఇది కాపీ కాదు. బాబీ రాసిన కథ నిజంగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది” అని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. ఇంతటితోనైనా కథపై వస్తున్న రూమర్లు ఆగుతాయోమో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus