ఎన్టీఆర్ దెబ్బకి దద్దరిల్లిపోతున్న ప్యాలెస్

  • July 25, 2017 / 06:49 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమి చేసిన మామూలుగా చేయరు. పాటల్లోనూ, ఫైట్స్ లోను తనలోని పూర్తి అవుట్ ఫుట్ బయటపెడుతారు. అది తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. తాజాగా పూణే వాసులు కళ్లారా చూస్తున్నారు. అక్కడే కొన్ని రోజులుగా ఎన్టీఆర్ జై లవకుశ షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్‌ చిత్రం ‘రామ్‌లీల’ తీసిన ప్యాలెస్‌ లో ఎన్టీఆర్ పై కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ నటన కి ప్యాలెస్ దద్దరిల్లిపోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు అక్కడే కొనసాగే షెడ్యూల్ ల్లో ఓ పాట కూడా తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్నారు.

బాబీ తారక్ నటనలోని అన్ని కోణాలను ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా, నందితా రాజ్ లు నటిస్తుండగా, విలన్ పాత్రలో  బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు ఆగస్టు 12న రిలీజ్ కానున్నాయి. భారీ అంచనాలు నెలకొని ఉన్న మూవీ సెప్టెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus