జై లవకుశ టీజర్ వీడియోని లీక్ చేసిన వారిని పట్టుకున్న పోలీసులు

  • June 28, 2017 / 09:18 AM IST

క్రేజీ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించడమే కాదు.. దానిని లీక్ కాకుండా చూసుకోవడం కూడా ప్రస్తుతం చాల కష్టం అవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్టార్ హీరోల సినిమాకు సంబంధించిన వీడియోలు లీక్ అయి చిత్ర బృందానికి చమటలు పట్టిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జైలవకుశ చిత్రానికి లీక్ కష్టం ఎదురైంది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ ని జులై మొదటి వారంలో రిలీజ్ చేయాలనీ నిర్మాత కళ్యాణ్ రామ్ భావించారు. అందుకోసం టీజర్ కి మెరుగులు దిద్దడానికి ఓ కంపెనీకి అందించారు. ఆ టీజర్ పూర్తి కాకముందే అందులోని షాట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. నెట్లో విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ విజువల్స్ ఎన్టీఆర్ పాత్ర తాలూకు స్వభావాన్ని బయటపెట్టేవిగా ఉన్నాయి.

దీంతో యూనిట్ సభ్యులతో పాటు, అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన తారక్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడమేగాక సోషల్ మీడియాలో లీకైన విజువల్స్ ను షేర్ చెయ్యొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి కూడా చేసింది. పిర్యాదు అందుకున్న పోలీసులు కొద్ది సమయంలోనే విజువల్స్ బయటికి రావడానికి కారణమైన వారిని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తులు ఎవరు, లీకేజికి ఎందుకు పాల్పడ్డారు? అనే వివరాలను మీడియా వారికీ పోలీసులు తెలపనున్నారు. యంగ్ టైగర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ  సెప్టెంబర్ 21 న థియేటర్లలో  రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus