జై లవ కుశ, స్పైడర్, మహానుభావుడు చిత్రాల వసూళ్లు!

  • October 3, 2017 / 09:30 AM IST

ఈ దసరాకి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవితో పోటీలో నిలిచి విజయం అందుకున్న శర్వానంద్.. ఈ సారి ఎన్టీఆర్, మహేష్ బాబుతో ఢీ కొట్టారు. మరో సారి హిట్ సొంతం చేసుకున్నారు. తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేసిన “జై లవ కుశ” గత నెల 21 న రిలీజ్ అయి మంచి కలక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం  ఆదివారం నాటికీ ( 11 రోజులకు) 70 కోట్ల షేర్ ను రాబట్టింది. సూపర్ స్టార్  మహేష్ బాబు తొలిసారి చేసిన ద్వి భాష చిత్రం ‘స్పైడర్’ గత బుధవారం విడుదలై  మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా 5 రోజులకుగాను  43.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

శర్వానంద్ ‘మహానుభావుడు’ గా కొంత ఆలస్యంగా థియేటర్లోకి వచ్చినప్పటికీ భారీ వసూళ్లు రాబట్టాడు.  మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ నాలుగు రోజులకు (అక్టోబర్ 2 నాటికీ) ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘మహానుభావుడు’ కలక్షన్స్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఆనందాన్ని పంచగా.. స్పైడర్ వసూళ్లు నిరాశజనకంగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus