పొరపాటుకు మన్నింపు కోరింది – షావుకారు జానకి

  • May 8, 2018 / 09:07 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో నటీమణులుగా ఆకట్టుకున్నవారిలో షావుకారు జానకి ఒకరు. ఆమె హీరోయిన్ గా కంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించారు. ఈ తరం హీరోల సినిమాలోనూ నటిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. క్రిష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన కంచె చిత్రంలోనూ ఆమె నటన ప్రసంశనీయం. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈమె సావిత్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ” జెమినీ సంస్థ వారు నిర్మించే ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలో వేషం కోసం నేను ఆఫీస్ కి వెళ్లినప్పుడు అక్కడ నాకు గణేశన్ పరిచయమయ్యాడు. ఆ సినిమాలో నాకు అవకాశం వచ్చేలా చేశాడు. ఆ అభిమానంతో బ్రదర్ అని పిలిచాను” అని తొలి అవకాశం వచ్చిన సందర్భాన్ని జానకి వివరించారు.

ఇంకా మాట్లాడుతూ ” జెమిని గణేశన్ నాకు అద్దె ఇల్లు చూపించేటప్పుడు నేను సావిత్రిని మొదటిసారి చూశాను. అప్పటికి ఆమె ఇంకా సినిమాల్లోకి రాలేదు. ‘సంసారం’లో చిన్న పాత్ర ద్వారా పరిచయమైన సావిత్రి .. ‘దేవదాసు’లో పార్వతి పాత్రతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ పాత్ర నేను చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి అనేక సినిమాల్లో నటించాం. అప్పుడే గణేశన్ తో నేను చనువుగా ఉండటాన్ని సావిత్రి అపార్థం చేసుకుంది. నేను గణేశన్ సోదరుడిగా భావిస్తానని చెప్పడంతో మన్నించమని కోరింది.” అని అప్పటి విషయాన్నీ గుర్తుతెచ్చుకుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మూవీ మహానటి రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus