Janhvi Kapoor: తల్లి మరణం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్!

  • July 15, 2023 / 04:41 PM IST

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె 2018 దుబాయిలో మరణించారు. ఈమె మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఇక శ్రీదేవి మరణించిన తర్వాత ఆమె వారసురాలిగా తన పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అయితే శ్రీదేవి ఉండగానే ఈమె తన మొదటి సినిమా అవకాశాన్ని అందుకున్నారు.

ఈ విధంగా ఈ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలోనే శ్రీదేవి మరణించారు. అలా తన కుమార్తె సినీ కెరియర్ శ్రీదేవి చూడలేకపోయారని చెప్పాలి. ఇక జాన్వీకపూర్ సైతం పలు సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అలాగే ఈమె దేవర సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన బవాల్ అనే సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కాబోతుంది దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Janhvi Kapoor) జాన్వీ కపూర్ తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.అమ్మ చనిపోయినప్పుడు తాను దడక్ సినిమా షూటింగ్లో ఉన్నాను అయితే అమ్మ చనిపోయిన తర్వాత ఆ లోటును ఎవరు తీర్చలేదని ఈమె తెలియజేశారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆ పరిస్థితులను ఎదుర్కోవడం తనకు చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు.

అమ్మ చనిపోయిన తర్వాత చాలా రోజులపాటు తనకు ఏది అర్థం కాలేదని ఏదో జీవితంలో ముందుకు సాగిపోవాలన్న ఉద్దేశంతో రోజులు గడుపుతూ ఉన్నానని తెలిపారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి నేను బయటపడటం కోసం కాలంతో పెద్ద యుద్ధమే చేశానని ఈ సందర్భంగా శ్రీదేవి మరణం తర్వాత తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి జాన్వి కపూర్ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus