రిలీజ్ రోజే ఆన్లైన్ లో ప్రత్యక్షమైన సినిమా!

  • March 12, 2021 / 01:37 PM IST

సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది శ్రమ పడి, భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తుంటే ఒక్కరోజులోనే వాటిని పైరసీ చేసి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. పైరసీని అరికట్టాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా.. దాన్ని నివారించలేకపోతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు పైరసీ కారణంగా ఇబ్బంది పడ్డాయి. తాజాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమా కూడా పైరసీ బారిన పడింది. మహాశివరాత్రి సందర్భంగా గురువారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కామెడీ ఓ రేంజ్ లో పండింది. సినిమాకి హిట్ టాక్ రావడంతో యూనిట్ సంబరాలు చేసుకుంటుంది. అయితే ఆ సంతోషాన్ని ఒక్కరోజు కూడా ఉండకుండా చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ సినిమాను పైరసీ చేసి పలు వెబ్ సైట్స్ లో పెట్టేశారు. ఒక్కరోజు కూడా సినిమా థియేటర్లో ఆడకముందే ఫుల్ మూవీ డౌన్ లోడ్ లింక్ కొన్ని వెబ్ సైట్స్ లో దర్శనమిచ్చి షాకిచ్చింది.

దీని ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై పడే ఛాన్స్ ఉంది. తమిళ రాకర్స్ వాళ్లే ఈ సినిమా పైరసీ చేశారని అంటున్నారు. మరి దీనిపై చిత్రబృందం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి!

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus