‘ధఢక్’ సినిమా నన్ను కాపాడింది – జాన్వి కపూర్‌

  • June 20, 2018 / 11:49 AM IST

అతిలోక సుందరి శ్రీదేవి తన కుటుంబసభ్యులను, కోట్లాది అభిమానులను వదిలేసి హఠాత్తుగా దేవలోకానికి వెళ్లిపోయింది. ఆమె ఇక లేరు అనే సంగతి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణం. కూతుళ్లు జాన్వీ, ఖుషి లకు అమ్మలేని లోకం చీకటయింది. అయితే బోనీ కపూర్, అతని కుటుంబసభ్యులందరూ వీరిని కలుపుకొని కన్నీటిని తుడిచారు. మామూలు మనుషులను చేశారు. ఆ బాధలోనే జాన్వి కపూర్‌ తన తొలి చిత్రాన్ని కంప్లీట్ చేసింది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ‘ధఢక్’ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సంచలన వ్యూస్ అందుకుంది. బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్ నటించిన ఈ చిత్రం జులై 20 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో జాన్వీ పాల్గొంటోంది.

ఈ సమయంలో ఓ విలేఖరి “తల్లి లేరన్న బాధ నుంచి ఎలా తేరుకున్నారు?” అని జాన్వీ ని అడగగా.. ఆమె కాసేపు తల్లిని తలచుకొని ఇలా సమాధానం చెప్పింది. “అది అంత సులువైనది కాదు. నా పని, కుటుంబం నాలో ధైర్యాన్ని నింపాయి. ఒకవేళ చిత్రీకరణలో పాల్గొనలేకపోయినా, నటించలేకపోయినా పరిస్థితి ఇంకా దారుణంగా మారేది. చెప్పాలంటే అమ్మలేదన్న బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది ‘ధఢక్‌’ సినిమానే. ఈ సినిమా నాకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నన్ను ఎన్నో విధాలుగా కాపాడింది.” అని చెప్పింది. శ్రీదేవి అశీసులు ఈ సినిమాకి నిండుగా ఉంటాయని చిత్ర బృందం బలంగా విశ్వసిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus