తల్లిని తలుచుకుంటూ షూటింగ్ లో పాల్గొన్న జాన్వి!

  • March 10, 2018 / 05:33 AM IST

తల్లి శ్రీదేవి హఠాన్మరణంతో కూతుళ్లు జాన్వీ, ఖుషిలు బలాన్ని కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటికి వస్తున్నారు. దుఃఖంలో మునిగిపోయి ఉన్న జాన్వి ని మామూలు మనిషిని చేయాలనీ  కపూర్ ఫ్యామిలీలోని అమ్మాయిలు అంతా ఇలా ఒక్కటై  ఆమె పుట్టిన రోజుని సెలబ్రేట్ చేశారు. తండ్రి బోనీ కపూర్ తో కలిసి తన తల్లి అస్థికలను రామేశ్వరంలో కలిపారు. ఇక తాను తొలిసారి సంతకం చేసిన సినిమాని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత తనపై ఉంది. అందుకే జాన్వి ధడక్ మూవీ సెట్స్ కి వెళ్ళింది.

షూటింగ్ స్పాట్ కి అమ్మ లేకుండా వెళ్లడం ఇదే తొలిసారి. చిన్నపాపని స్కూల్ కి తీసుకెళ్లినట్టు శ్రీదేవి తీసుకువెళ్లి.. నటనలో మెళకువలు చెప్పేది. ఆ క్షణాలను గుర్తుకు తెచ్చుకొని.. తల్లికి తగ్గ తనయురాలు అని పేరు తెచ్చుకోవాలని షూటింగ్ లో పాల్గొంది. సింపుల్ ఆలివ్ గ్రీన్ శారీతో.. పోనీ వేసుకుని షాట్ కంప్లీట్ చేసింది. మరాఠీలో సూపర్ హిట్ సాధించిన సైరత్ మూవీకి రీమేక్ ధడక్. శశాంక్ ఖైతాన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇషాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జులై లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus