నిర్మాతగా మారుతున్న అల్లు అరవింద్ కుమారుడు

  • December 19, 2018 / 12:54 PM IST

నిర్మాతగా, ఫైనాన్సియర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, థియేటర్ ఓనర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ అయిన అల్లు అరవింద్ కి ఎప్పటి నుంచో ఒక కోరిక మిగిలిపోయింది. ఒక కొడుకు స్టైలిష్ స్టార్ గా సూపర్ ఫామ్ లో ఉన్నాడు, ఇంకో కొడుకు ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నాడు ఇంకేం కావాలి ఆయనకు అనుకొంటున్నారా. ఒక తండ్రిగా ఆయన కుమారులను చూసుకొని ఎంత మురిసిపోయినా.. ఒక నిర్మాతగా తనకు వారసుడు లేడని మాత్రం ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాడు. అందుకే.. తన చుట్టూ ఉన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తూ నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటాడు అల్లు అరవింద్. అయితే.. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరనుంది.

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ మొన్నటివరకు యానిమేషన్ కంపెనీలో వర్క్ చేశాడు. ఇప్పుడు ఆయన నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ అనే యువ ప్రతిభాశాలి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా అల్లు బాబీ నిర్మాతగా మారుతున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కాక.. సొంత బ్యానర్ ను ప్రారంభించి తన స్నేహితుడు సిద్ధుతో కలిసి అల్లు బాబీ సినిమా నిర్మిస్తాడు. డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎలాగూ గీతా ఆర్ట్స్ మరియు యువీ క్రియేషన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి నిర్మాతగా తనకు సరైన వారసుడు లేడన్న బాధ అల్లు అరవింద్ కి తీరిపోయినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus