అయన మరణం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది : ఎన్టీఆర్

  • May 6, 2019 / 01:44 PM IST

ఎన్టీఆర్ వీరాభిమాని అయిన జయదేవ్ మరణించాడు. కేవలం అభిమాని మాత్రమే కాదు.. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా…! కృష్ణాజిల్లా కు చెందిన జయదేవ్.. ఎన్టీఆర్ అభిమాన సంగం ప్రతినిధి. ఇక ఆయన మరణం పట్ల ఎన్టీఆర్ సానుభూతి వ్యక్తం చేశాడు. జయదేవ్ మరణం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఆయన లేని లోటు తీరనిదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ లేఖ కూడా విడుదల చేసాడు ఎన్టీఆర్. అభిమానుల పట్ల తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నాడు.

ఈ లేఖ ద్వారా ఎన్టీఆర్ స్పందిస్తూ… ”నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణాజిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను” అని అభిమాని మృతిపట్ల విచారణ వ్యక్తం చేశాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus