జూ.ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక అసలు కారణం అదేనా ..?

నందమూరి బాలకృష్ణ -క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగమైన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం మూడు రోజుల క్రితం (జనవరి 9న) సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా సినిమా అద్భుతం అంటూ ట్వీట్ చేసాడు. అయితే జూ.ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రాన్ని ఇంకా చూడక పోవడం… దీని పై స్పందించక పోవడం వంటి విషయాలు సంచలనంగా మారాయి.

విషయంలోకి వెళితే… విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా… ఈ చిత్రం పై ‘జూ.ఎన్టీఆర్’ స్పందించకపోవడం పై పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు. బాలయ్యకు – ఎన్టీఆర్ కు..గ్యాప్ ఏర్పడిందనీ.. నందమూరి హరికృష్ణ మరణం తరువాత.. పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసినప్పటికీ.. పూర్తిగా వీరి బంధం బలపడలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక మరోవైపు… తన ఇంట్లోనే క్యూబ్ థియేటర్ లో సినిమాలు చూసే ఎన్టీఆర్ తన తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం వలనే సినిమా చూడలేదని తెలుస్తోంది. ఆమె కోలుకున్న వెంటనే తన తల్లి, భార్యలతో కలిసి ఈ సినిమా చూడాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీటిలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus