ఎన్టీఆర్ ఫోకస్ మారింది.. కొరటాల సినిమా లేనట్టే..!

  • August 8, 2019 / 02:33 PM IST

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. 2020 మార్చికి ఈ చిత్రం పూర్తయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి 2020 జూలై 30 కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ తో పనిచేస్తాడా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో త్రివిక్రమ్ తోనే తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పాడట. ఇక త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తాడట. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్.. కొరటాలతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. ఇందుకు సంబందించిన కథా చర్చలు కూడా జరిగాయట. కొరటాల వినిపించిన కథకి ఎన్టీఆర్ కూడా పాజిటివ్ గానే స్పందించాడట. కానీ ఇప్పుడు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ పేర్లు ఫైనల్ అయ్యాయి. దీంతో ఎన్టీఆర్.. కొరటాలకి హ్యాండిచేసినట్టేనని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus