Nandamuri Mokshagnya: ఒక్క ట్వీట్ తో కథ మొత్తం మార్చేసి.. ఒక మెట్టు ఎక్కిన ఎన్టీఆర్

  • September 6, 2024 / 12:31 PM IST

నందమూరి కుటుంబంలో చీలిక ఉందనే విషయం అందరికీ తెలిసిన సీక్రెట్. మొన్న జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడం, కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడంతో ఆ చీలిక నిజమే అని స్పష్టమైంది. కట్ చేస్తే.. ఇవాళ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అతడి తెరంగేట్రాన్ని ఎనౌన్స్ చేయగా.. ఇండస్ట్రీ వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Nandamuri Mokshagnya

అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) “హ్యాపీ బర్త్ డే మోక్షు” అని వేసిన ట్వీట్ చిన్నపాటి ప్రకంపన సృష్టించింది. బాలయ్యకు-ఎన్టీఆర్ కు మంచి సఖ్యత లేకపోయినా.. ఎన్టీఆర్ తో బాలయ్య కొడుకు మరియు కూతుళ్లు బాగానే మెలుగుతారు. ఈ సినిమాతో తేజస్విని కూడా నిర్మాతగా అఫీషియల్ ఎంట్రీ ఇస్తుండడంతో ఎన్టీఆర్ ఈ ట్వీట్ వేశాడని తెలుస్తోంది.

ఏదేమైనా ఎన్టీఆర్ ఇలా మోక్షజ్ఞకు సపోర్ట్ చేస్తూ సాదరంగా “సినిమాల్లోకి ఆహ్వానం” పలకడం అనేది మెచ్చుకోవాల్సి విషయం. ఈ ఒక్క ట్వీట్ తో నందమూరి కుటుంబం మీద వస్తున్న సమీకరణలను మార్చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికైనా నందమూరి మరియు తెలుగు దేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ ను పక్కన పెట్టడం ఆపి.. అతడ్ని ఓన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే.. ఒకవేళ వాళ్లు ఓన్ చేసుకోకపోయినా ఎన్టీఆర్ కి పోయేది ఏమీ లేదు.

ఒక రకంగా చెప్పాలంటే.. ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ ఒక మెట్టు ఎక్కాడనే చెప్పాలి. అయితే.. ప్రస్తుతానికి మోక్షజ్ఞకు అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్స్ ఏమీ లేవు కాబట్టి.. నందమూరి తేజస్విని అర్జెంటుగా పూనుకొని ఏదో ఒక విధంగా ఎన్టీఆర్ తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెప్పగలిగితే వారి నడుమ అనుబంధం మరింత బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ విధంగానైనా బాలయ్య & ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకరినొకరు తిట్టుకోవడం మానేస్తే బాగుంటుంది.

 

బాలయ్య నట వారసుడు లేట్ గా వస్తున్నా.. లేటెస్ట్ గా వస్తున్నాడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus