చిరు,చరణ్ ప్లేస్లో ఎన్టీఆర్ వస్తున్నాడట..!

  • March 27, 2019 / 03:58 PM IST

సాయితేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. యూత్ ఫుల్ చిత్రాలని తెరకెక్కించే కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ ట్రైలర్లకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రంలోని రెండు పాటలను తాజాగా విడుదల చేయగా అవి కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారట.

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కాబోతున్నాడని తాజాసమాచారం. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థకి ఎన్టీఆర్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ బ్యానర్లో ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని కూడా చేసాడు తారక్. నిజానికి మైత్రి వారి మొదటి చిత్రమైన ‘శ్రీమంతుడు’… ఎన్టీఆర్ చేయాల్సిందేనంట.. కానీ ఆ కథ నచ్చలేదని ఎన్టీఆర్ తప్పుకున్నాడని గతంలో టాక్ నడిచింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ ఈ బ్యానర్లో ఓ చిత్రం చేయబోతున్నాడని సమాచారం. ఈ అనుబంధంతోనే ఎన్టీఆర్ ఈవెంట్ కు హాజరవ్వబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. మొదట ఈ వేడుకకి చిరంజీవి లేదా చరణ్ ను పిలవలనుకున్నారట. కొన్నికారణాల వలన వీరిద్దరూ హాజరవ్వడం కుదరలేదని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ ను ఆహ్వానించారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus