యాంటీ ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంటున్న ఎన్టీఆర్

  • April 7, 2018 / 01:21 PM IST

ఏ పరిశ్రమలోనైనా హీరోలకు ఫ్యాన్స్ ఎంత సహజమో.. యాంటీ ఫ్యాన్స్ అంతే సహజం. ఈ యాంటీ ఫ్యాన్స్ వల్ల గతఏడాది తెలుగు హీరోలకి చాలా నష్టం జరిగింది. స్టార్ హీరో రిలీజ్ నాడు ఫ్యాన్స్ తో పోటీగా యాంటీ ఫ్యాన్స్ సినిమా చూడడం అందులోని నెగటివ్ ని సోషల్ మీడియాలో బూతద్దం లో చూపించారు. ఇలా చేయడం వల్ల కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా యాంటీ ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులు తప్పలేదు. అయితే తనకి ఈ యాంటీ ఫ్యాన్స్ లేకుండా చేసుకుంటున్నారు. టెంపర్ నుంచి కథల్లో వైవిధ్యం.. నటనలో కొత్తదనం చూపిస్తూ ఆర్టిస్టుగా చాలామందిని అభిమానులుగా చేసుకున్నారు. అలాగే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించి.. ఈగోలు పక్కన పెట్టి.. కంటెస్టెంట్స్ తో కలిసిపోయి టీవీలకే పరిమితమైన మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పుడు అతని స్టెప్స్ యాంటీ ఫ్యాన్స్ ఈగోని పోగొడుతోంది.

అందులో మొదటిది తన సినిమాకి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభింపజేయడం. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పవన్ తో సరదాగా ఉంటూ.. పవన్ ఫ్యాన్స్ ని తనవైపు తిప్పుకున్నారు. అంతేకాదు రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ ని పంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మెగా అభిమానులను ఫ్లాట్ చేశారు. ఇక మెగా ఫ్యాన్స్ తారక్ పై విమర్శించరు. తాజాగా మహేష్ బాబు సినిమా బహిరంగ సభకు హాజరై సూపర్ స్టార్ అభిమానుల మనసు దోచుకున్నారు. ఇలా తెలివిగా యాంటీ ఫ్యాన్స్ లేకుండా ఎన్టీఆర్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ని అభిమానించే వారిలో నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మెగా స్టార్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus