ఒక్క అవార్డు కి ఇంత ఎమోషన్ ఎందుకు కైరా…?

  • January 8, 2019 / 11:25 AM IST

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘భరత్ అనే నేను’ తో టాలీవుడ్ కు పరిచయమయ్యింది ప్రముఖ బాలీవుడ్ నటి కైరా అద్వానీ. చేసిన మొదటి చిత్రంతోనే.. తన అందంతో పాటు నటనతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా టాలీవుడ్ చిత్రాలకు గానూ ‘జీ సినిమాస్’ అవార్డ్స్ ప్రకటించింది.

ఈ అవార్డు వేడుకల్లో కైరా అద్వానీకి ‘భరత్ అనే నేను’ చిత్రానికి గాను `బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్’ గా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా కైరా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కైరా ఈ విషయం పై స్పందిస్తూ … “భరత్ అనే నేను నా లైఫ్ లో మరిచిపోలేని సినిమా. వసుమతిగా నా నటనకు మంచి పేరొచ్చింది. ప్రేక్షకులు నన్ను గుండెల్లో పెట్టుకుని నన్ను ఓటింగ్ ద్వారా అవార్డుకు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు“ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక జీ సంస్థకు కూడా ధన్యవాదాలు చెబుతూ.. తనని టాలీవుడ్ కు తీసుకొచ్చిన మహేష్- నమ్రత పై ప్రశంసల జల్లు కురిపించింది. ఇక కొరటాల- డివివి దానయ్య లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు..”

అంటూ తెలిపింది. ప్రస్తుతం కైరా ‘వినయ విధేయ రామా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్దమవుతుంది. దీనితో పాటు ప్రస్తుతం ‘బన్నీ -త్రివిక్రమ్’ కాంబినేషన్లో తెరేకేక్కబోయే చిత్రానికి కూడా హిరోయిన్ గా ‘కైరా అద్వానీ’ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus