గంట సేపు డోర్లు తెరవలేదంట..!

  • January 3, 2019 / 12:16 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరెక్షన్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే కాజల్ తాజాగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. విషయంలోకి వెళితే… ప్రముఖ విమాన సంస్థయిన ‘జెట్ ఎయిర్ వేస్’ పై కాజల్ మండిపడింది. ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు విషయం పరిశీలిస్తే… ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే వారు చేరుకున్నప్పటికీ…. కౌంటర్ స్టాఫ్ అయిన మోయిన్ అనే వ్యక్తి తమ సమయాన్ని వృథా చేశాడని ఆరోపణ వ్యక్తం చేసింది. ఇక అటు తరువాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండీ డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు విమానాన్ని తీసుకెళ్ళి … మరో 30 నిమిషాల పాటు పార్క్ చేశారని వారి పై మండిపడింది కాజల్. ఇలా గంటసేపు డోర్లను కూడా మూసి ఉంచారని …… ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో వారంతా చాలా ఇబ్బంది పడ్డామని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. కాజల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus