మామా అల్లుళ్లతో ఒకేసారు!

  • August 30, 2016 / 06:45 AM IST

ఒకపక్క మామయ్య చిరంజీవితో సరసాలాడుతూనే.. మరోపక్క మేనల్లుడితో జతకట్టేందుకు సిద్ధమవుతోంది క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్. మెగా ఫ్యామిలీలోని అందరి హీరోలతోనూ నటించేసి “పర్ఫెక్ట్ మెగా హీరోయిన్” అనిపించుకొన్న కాజల్ ఆ మెగా లీగ్ ను కంటిన్యూ చేసేద్దామని ఫిక్స్ అయిపోయినట్లుంది. అందుకే ఒకపక్క చిరంజీవి “ఖైదీ నెం.150″లో హీరోయిన్ గా నటిస్తూనే.. అల్లు అర్జున్ సరసన ముచ్చటగా మూడోసారి కథానాయికగా కనువిందు చేయనుంది.

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా నిన్న హైద్రాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయిన “దువ్వాడ జగన్నాధమ్” సినిమా కోసం హీరోయిన్ గా తొలుత “ముకుందా” ఫేమ్ పూజా హెగ్డేను అనుకొన్నారు. కానీ ఆఖరి నిమిషంలో అమ్మడు హ్యాండ్ ఇవ్వడంతో.. శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా 2017 ఏప్రిల్ లో విడుదలవుతుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus