ఏక్ నిరంజన్ షూటింగ్ సంగతులు గుర్తుచేసిన కంగనా!

  • October 19, 2018 / 08:11 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇష్టపడని అమ్మాయి అంటూ ఉండరు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్ తారలు సైతం డార్లింగ్ తో నటించాలని ఆశపడుతున్నారు. అటువంటిది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రభాస్ తో గొడవకు దిగింది. మాట్లాడటం మానేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు.  ఆ చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్ కి కంగనాకు మధ్య చిన్న గొడవ జరిగిందంట. అప్పట్లో ఈ న్యూస్ బయటికి వచ్చింది కానీ దీనిపై ప్రభాస్, కంగనా స్పందించలేదు. ఈ విషయాన్నీ ఇప్పుడు స్వయంగా ఆ భామే చెప్పింది.

“ఏక్ నిరంజన్ సమయంలో మా మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆపై మేమిద్దరం మాట్లాడుకోవడమే మానేశాం” అని ఆమె తన మిత్రులకు చెప్పినట్లు బయటికి వచ్చింది. అంతేకాదు ‘బాహుబలి’లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, ‘మణికర్ణిక’లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని చెప్పిందట. దీంతో ప్రభాస్ అభిమానులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. అసలు గొడవ ఎందుకు జరిగిందో చెప్పకుండా.. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు చర్చించడం వెనుకాల ఉన్న అర్ధం తమకి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణికర్ణిక సినిమా బాగుంటే ప్రపంచమే మిమ్మల్ని అభినందిస్తుందని కౌంటర్ ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus